జిల్లాకు ఈ ఏడాది తుంగభద్ర జలాశయం నీటి కోటా కేటాయింపు ముగియడంతో మంగళవారం నుంచి నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. విడుదల చేసిన మొత్తం 17.363 టీఎంసీల నీటిలో 16.070 టీఎంసీలు పోను జిల్లా సరిహద్దుకు చేరినట్లు హెచ్సీఎల్సీ ఎస్ఈ రాజశేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ప్రస్తుతం తుంగభద్ర జలాశయానికి 495 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా, 6,802 క్యూసెక్కుల నీటిని కాల్వలకు వదులుతున్నారు. మిగిలిన నిల్వ కనిష్టంగా 14.814 టీఎంసీలు. జిల్లా పరిధిలో పీఏబీఆర్లో 2.403 టీఎంసీలు, ఎంపీఆర్లో 0.605 టీఎంసీల నీరు ఉన్నట్లు ఎస్ఈ రాజశేఖరం స్పష్టం చేశారు.
Discussion about this post