నాలుగు దశాబ్దాల రాజకీయ జీవితంలో జేసీ సోదరులు చేయలేని అభివృద్ధిని వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన ఈ ఐదేళ్లలో చేసి చూపించాం. ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను చేరువ చేయడంలో భాగంగా స్థానిక ప్రభుత్వాస్పత్రిని వంద పడకలకు పెంచేలా చర్యలు తీసుకున్నాం. నివేదికలు సిద్ధం చేసి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగానే వెంటనే ఆయన స్పందించి రూ.24 కోట్ల నిధులు ఇచ్చారు. పనులు వేగవంతం చేసి, ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చాం.
source : sakshi.com
Discussion about this post