అనంతపురం నగరంలోని 5వ డివిజన్ లో బుధవారం ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కలిగిన లబ్ధి, అనంతపురం నియోజకవర్గంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి కరపత్రాలను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నాడు-నేడు ద్వారా ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో అనేక మార్పులను తీసుకు వచ్చి పేదలకు విద్య, వైద్యం భారం కాకుండా సీఎం జగన్మోహన్ రెడ్డి అనేక పథకాలను తీసుకొచ్చారని, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుని ప్రజా సంక్షేమ పాలనతో పాటు, అనంతపురం నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అభ్యర్థించారు.

Discussion about this post