మూడు, నాలుగు రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తోంది. 2014లో మాదిరిగానే చంద్రబాబు, దత్తపుత్రుడు మళ్లీ బీజేపీతో కలిశారు. నాడు మేనిఫెస్టో హామీలను విస్మరించినట్లుగానే ఇప్పుడు రంగురంగుల హామీలు గుప్పిస్తున్నారు. వారి మోసాలు, దగాను గమనించాలని కోరుతున్నా.చంద్రబాబు పేరు చెబితే వంచన, దత్తపుత్రుడి పేరు చెబితే ఐదేళ్లకోసారి కారును మార్చినట్టుగా భార్యను మార్చే ఓ మోసగాడు, వంచకుడు గుర్తుకొస్తాడు! ఒకరికి విశ్వసనీయత లేదు.. ఇంకొకరికి విలువలు లేవు. మూడు పార్టీలు కూటమిగా ఏర్పడి ఈ రోజు పేదవాడి భవిష్యత్తుపై యుద్ధానికి వస్తున్నాయి. పొరపాటు చేయవద్దని, అందరూ బాగా ఆలోచన చేయాలని కోరుతున్నా.
source : sakshi.com
Discussion about this post