అన్న క్యాంటీన్లను తొలగించి పేదల ఆకలిని రెట్టింపు చేసిన జగన్కు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. గుత్తి మండలంలోని బేతాపల్లి, ధర్మాపురం గ్రామాల్లో గురువారం నిజం గెలవాలి కార్యక్రమం నిర్వహించారు. ధర్మాపురంలో ఆంజనేయ, బేతాపల్లిలో జయమ్మ కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. బేతాపల్లి గ్రామంలో భువనేశ్వరి మాట్లాడారు. తల్లీ, చెల్లికి న్యాయం చేయలేని జగన్.. తెలుగు తల్లికి ఏం న్యాయం చేస్తారని విమర్శించారు.
source : eenadu.net
Discussion about this post