అనంతపురం నగరంలోని 4వ డివిజన్ లో మంగళవారం ‘ఇంటింటికీ వైసీపీ’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో కలిగిన లబ్ధి, అనంతపురం నియోజకవర్గంలో ఐదేళ్లలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి కరపత్రాలను ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పంపిణీ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అనంతపురం నగరంలోని ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రోడ్లు, డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాం, రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైఎస్ జగన్మోహన్రెడ్డిని మరోసారి ముఖ్యమంత్రిగా చేసుకుని అనంతపురం నగరాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అభ్యర్థించారు.

Discussion about this post